క్రైమ్/లీగల్

దాడి ఘటనపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 29: తమ పార్టీ అధ్యక్షుడు, ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి ఘటనపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు వైవీ సుబ్బారెడ్డి సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా దాడి ఘటనపై ఇదివరకే ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్)పై మంగళవారం విచారించనున్నందున, బుధవారం ఈ పిటీషన్‌పై విచారణ చేపడతామని హైకోర్టు పిటీషనర్ తరపు న్యాయవాదికి తెలిపింది.