క్రైమ్/లీగల్

ఎస్‌ఆర్‌బీసీ కాలువలో మృతదేహం లభ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బనగానపల్లె, మార్చి 5:మండల పరిధిలోని రామతీర్థం గ్రామ సమీపంలో ఎస్‌ఆర్‌బీసీ కాలువలో ఆదివారం గల్లంతైన యువకుడి మృతదేహం సోమవారం లభ్యమైనట్లు ఎస్‌ఐ శంకరయ్య తెలిపారు. వివరాలు.. మృతుడిని ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన బోయ నరసింహుడు(20)గా గుర్తించినట్లు ఎస్‌ఐ తెలిపారు. రామతీర్థం గ్రామంలో ఒక వివాహానికి వచ్చిన నరసింహుడు స్నానం చేసేందుకు ఎస్‌ఆర్‌బీసీ కాలువకు వెళ్లాడని, అయితే ప్రమాదవశాత్తూ కాలువ అడుగు భాగంలో గుంతలు వుండడంతో నీటిలో చిక్కుకుపోయాడన్నారు. దీంతో స్థానికుల సహకారంతో కాలువలో గాలించగా సోమవారం నరసింహుడి శవం లభ్యమైందని, దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.