క్రైమ్/లీగల్

ఔటర్ రింగ్‌రోడ్డుపై ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, నవంబర్ 13: ఔటర్ రింగ్ రోడ్డుపై వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో దంపతులు, చిన్నారి అక్కడికక్కడే మృతిచెందారు. కీసర సీఐ ప్రకాశ్ కథనం ప్రకారం జార్ఖండ్ రాష్ట్రం జాన్‌ముడి మండలం ధూమ్‌కా టౌన్‌కు చెందిన దినేష్ కుమార్ ఉద్యోగరీత్యా నగరంలోని హైదర్‌గూడ, కేశవనగర్‌లో ఉంటున్నారు. మంగళవారం దినేష్ కుమార్(38), భార్య సాగరిక ప్రియమ్(28), రుద్రాన్ష్ (మూడు నెలలు) చిన్నారితో కలిసి ఘట్‌కేసర్ నుంచి ఆల్టో కారులో కీసర వైపు వెళుతుండగా కీసరదాయర సమీపానికి రాగానే కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. రింగ్ రోడ్డుపై పెద్ద శబ్ధం చేస్తూ పల్టీలు కొట్టింది. కారులోనే తీవ్ర గాయాలపాలైన దినేష్ కుమార్, సాగరిక ప్రియమ్, చిన్నారి అక్కడికక్కడే మృతిచెందారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కారులో నుంచి మృతదేహాలను బయటికి తీసారు. మృతురాలి తమ్ముడు రిషికేశ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.