క్రైమ్/లీగల్

వివాహిత ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడిబండ, నవంబర్ 15 : మండల పరిధిలోని హిరేతుర్పి సమీపంలో కర్నాటక ప్రాంతానికి చెందిన లక్ష్మి (28) చెట్టుకు ఉరేసుకని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కర్నాటక రాష్ట్రం కోటకు చెందిన లక్ష్మికి మధుగిరి తాలూకా సిదరగల్లుకు చెందిన యతీష్‌తో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈనేపథ్యంలో లక్ష్మి మంగళవారం మధ్యాహ్నం పుట్టింటికి వెళ్తానని భర్తతో చెప్పి కుమారులు పిలుచుకుని వెళ్లింది. పుట్టింటికి వెళ్తూ మార్గమధ్యలో ఆత్మహత్యకు పాల్పడింది. గురువారం ఉదయం పొలం యజమాని పోలీసులకు సమాచారం అందించగా మడకశిర సీఐ దేవేంద్రకుమార్, ఎస్సై శరత్‌చంద్ర ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా చెట్టు పక్కన ఉన్న ఓ పెద్ద బావి గట్టుపైన ఇద్దరు చిన్నారుల పాదరక్షలు ఉండటం, లక్ష్మితోపాటు వచ్చిన కుమారులు కనిపించపోవడంతో అగ్నిమాపక యంత్రాన్ని రప్పించి నీటిని బయటకు ప్రయత్నాలు చేస్తున్నారు. లక్ష్మి తనతోపాటు తీసుకొచ్చిన కుమారులను బావిలోకి తోసి ఆత్మహత్యకు పాల్పడిందా, లేక ఎవరైనా హత్య చేసి బావిలోకి పడవేశారా అన్న విషయాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.