క్రైమ్/లీగల్

యతి ఫుడ్స్‌పై విజిలెన్స్ దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ రూరల్, నవంబర్ 16: జిల్లా విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు యతి ఫుడ్స్, వాటర్ ప్లాంట్‌లపై దాడులు చేసి కేసులు నమోదు చేశారు. విజిలెన్స్ డిజి గౌతం సేవాంగ్ ఆదేశాల మేరకు విజిలెన్స్ ఎస్పీ రెడ్డి గంగాధర్ తన టీంతో ఈ దాడులు జరిపారు. రమణయ్యపేట ఇండస్ట్రీయల్ కాలనీలోని యతి ఫుడ్స్, నాగమల్లి జంక్షన్‌లోని వాటర్ ప్లాంట్‌పైనా శుక్రవారం దాడులు జరిపారు. ఎటువంటి ప్రభుత్వ ఆనుమతి లేకుండా నిర్వహిస్తున్న ఈ ప్లాంట్‌ను సీజ్ చేశారు. సీజ్ చేసిన వాటర్ ప్లాంట్‌లను తగు చర్యలు నిమిత్తం, రెవెన్యూ అధికారులకు అప్పగించడమైంది. ఈ సందర్భంగా ఎస్పీ రెడ్డి గంగాధరరావు మాట్లాడుతూ వాటర్ ప్లాంట్స్‌ను నిర్వహించడానికి ప్రభుత్వంపై తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని లేనిచో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.