క్రైమ్/లీగల్
ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడి దుర్మరణం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 20 November 2018
ఉప్పల్, నవంబర్ 19: ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు దుర్మరణం చెందిన సంఘటన ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం సరూర్నగర్ జింకల బావి కాలనీలో నివసిస్తున్న కేసని సతీష్ (24) ప్రైవేటు ఉద్యోగం. అతడు సోమవారం హబ్సిగూడ వైపు బైక్ వెళ్తుండగా ప్రమాదవశాత్తు సర్వే ఆఫ్ ఇండియా గేట్ వద్ద వెనుక నుంచి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతో ప్రమాదం జరిగిందని అన్నారు. తీవ్రంగా గాయపడిన సతీష్ అక్కడిక్కడే మరణించాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అనంతచారి తెలిపారు.