క్రైమ్/లీగల్

హైకోర్టును ఆశ్రయించిన కెఇ తనయుడు శ్యాంబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 8: ఒక ప్రైవేటు ఫిర్యాదు కేసులో తనపై హత్య కేసును బనాయిస్తూ కర్నూలు జిల్లా డోన్ జూనియర్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆంధ్ర ప్రభుత్వ ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి కుమారుడు కెఇ శ్యాంబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ప్రైవేట్ ఫిర్యాదును వైకాపా నేత శ్రీదేవి కోర్టులో దాఖలు చేశారు. శ్రీదేవి తన భర్త లక్ష్మీ నారాయణ రెడ్డి హత్య కేసుపై కోర్టులో ఫిర్యాదు చేశారు. 2017 మే 21వ తేదీన లక్ష్మీనారాయణ రెడ్డి కృష్ణగిరి పోలీసు స్టేషన్ పోలీసు పరిధిలో హత్యకు గురయ్యారు. ఈ కేసులో చార్జిషీటు నమోదు సమయంలో పోలీసులు కె ఇ శ్యాంబాబు, బొజ్జమ్మ పేర్లను తొలగించారు. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు పి వీరారెడ్డి వాదనలు వినిపంచారు. అనంతరం ఈ కేసు విచారణను వచ్చే బుధవారానికి హైకోర్టు వాయిదా వేసింది.