క్రైమ్/లీగల్

భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మల్యాల, నవంబర్ 29: భార్యపై అనుమానం పెనుభూతంగా మారి చిన్నతగువుతో పొట్లాడుతకొని భార్యగొంతు కోసి చంపి తాను ఆత్యహత్యకు పాల్పడ్డ సంఘటన మల్యాల మండలకేంద్రంలో సంచలనంగా మారింది. మల్యాల మండలకేంద్రానికి చెందిన కరబూజ శ్రీనివాస్ (37) గత రెండేండ్లుగా ఉపాధి కోసం గల్ఫ్‌దేశానికి వెళ్లి నెల క్రితమే స్వగ్రామానికి చేరుకున్నాడు. వచ్చిన నాటి నుండి భార్యపై అనుమానంతో ప్రతినిత్యం గొడవలు చేసుకునే వాడని బుధవారం అర్ధరాత్రి ఇంట్లో ఉన్న పిల్లలను బయటకు పంపించి, తలుపు గడియవేసి భార్యభర్తలిద్దరూ పొట్లాడుకున్నారు. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ గతంలో తాను గీతకార్మికుని పనిలో వినియోగించే పదునైన కత్తితో లక్ష్మి(30) గొంతు కోసి హతమార్చాడు. అనంతరం తాను కూడా అదే ఇంట్లో ధూలానికి లుంగీతో ఉరేసుకుని ఆత్యహత్యకు పాల్పడ్డాడు. శ్రీనివాస్ గతంలో సైతం మొదటి భార్య సైతం కుటుంబ కలహాలవల్ల ఒంటిపై కిరోసిన్‌పోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెకు ఇద్దరు సంతానం కాగా రెండో భార్య లక్ష్మికి పాప జన్మించింది. మృతురాలి లక్ష్మి తల్లి ముంజల గంగవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వివరించారు. తల్లిదండ్రుల మరణంతో ఆ ముగ్గురు చిన్నారులు అనాథలుగా మారారు. డీఎస్పీ వెంకటరమణ, సీఐ నాగేంధర్, ఎస్సై మిథున్‌లు వివరాలు సేకరించారు.