క్రైమ్/లీగల్

బాలికపై తండ్రీ కొడుకుల అత్యాచారం ..* బాలిక ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాంపల్లి, డిసెంబర్ 1: అభం శభం తెలియని అమాయక మైనర్ బాలికపై తండ్రీ, కొడుకులు కొన్ని నెలలుగా అత్యాచారానికి పాల్పడుతుండటంతో జీవితంపై విరక్తి చెందిన ఆ బాలిక ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని తిరుమలగిరి గ్రామంలో సంచలనం రేపింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తిరుమలగిరి గ్రామానికి చెందిన మైనర్ బాలిక(16) అదే గ్రామానికి చెందిన బూతం శ్రీను, అతని మైనర్ కుమారుడు గత కొంత కాలంగా లొంగతీసుకుని అత్యాచారం సాగిస్తున్నారు. దీంతో ఆ బాలిక ఏడు నెలల గర్బవతికాగా శక్రవారం అర్థరాత్రి క్రిమి సంహారక మందు సేవించి ఆత్మహత్య చేసుకుంది. బాధిత మైనర్ బాలిక గత సంవత్సరం తొమ్మిదవ తరగతి చదువును మధ్యలోనే నిలిపివేసింది. ఇంటి వద్దనే ఉంటూ కూలీ నాలీ పని చేసుకుంటు తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటుంది. అదే గ్రామానికి చెందిన బూతం శ్రీను తన ఆటోలో ఆ బాలికను పనులకు తీసుకెలుతు పరిఛయం పెంచుకుని మాయ మాటలతో లోబరుచుకున్నారు. అతని కుమారుడు కూడా ఆమెతో శారీరక బంధం ఏర్పరుచుకున్నాడు. దీంతో బాలిక ఏడు నెలల గర్భవతి కాగా ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు బూతం శ్రీనును అతని కుమారుడిని శుక్రవారం రాత్రి నిలదీశారు. వారు పొంతన లేని సమాధానం చెప్పడంతో ఆందోళన చెందిన బాలిక అదే రోజు అర్ధరాత్రి ఇంటిలో ఉన్న క్రిమి సంహారక మందును సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు గ్రామస్థులు హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే బాలిక మృతి చెందింది. బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బూతం శ్రీను, అతని కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.