క్రైమ్/లీగల్

మహిళా దినోత్సవం నాడు ఎంఇఓపై కత్తిదూసిన ఉపాధ్యాయిని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 8: గుంటూరు జిల్లా అమరావతిలో మహిళా దినోత్సవం నాడు ఎంఇఓపై ఓ ఉపాధ్యాయిని కత్తిదూసిన సంఘటన సంచలనం కలిగించింది. అమరావతి మండల విద్యాశాఖ అధికారి ఓవి రామిరెడ్డిపై మండల పరిధిలోని లింగాపురం ఎంపీపీ స్పెషల్ స్కూల్‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయిని పి ఉమాదేవి దాడికి దిగారు. గురువారం ఉదయం మండల పరిషత్ కార్యాలయంలో ఎంఇఓ రామిరెడ్డిపై చెప్పుతో దాడిచేసిన ఆమె మధ్యాహ్నం కత్తి చేతపట్టుకుని చంపుతానంటూ వెంటపడ్డారు. భయపడిన ఎంఇఓ రామిరెడ్డి అక్కడి నుండి పరారై అమరావతి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎంఇఓ రామిరెడ్డి మాట్లాడుతూ గత ఏడాది జూలైలో ఆమె ప్రవర్తన బాగోక పోవడంతో స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సమగ్రంగా విచారణ జరిపి నివేదిక అందించగా, ఉమాదేవిని సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి ఉత్తర్వులు జారీచేశారన్నారు. అప్పటి నుండి ఆమె సస్పెన్షన్ ఉత్తర్వులు తీసుకునేందుకు కూడా నిరాకరించి, తన పట్ల దుర్భాషలాడుతూ, ఇప్పటికే ఆరు సార్లకు పైగా దాడికి యత్నించారన్నారు. తన భార్యపై కూడా ఆమె దాడికి యత్నించారని అమరావతి పోలీసుస్టేషన్‌లో ఎండీవో వై రాజగోపాల్, ఎంపీపీ నంబూరి చిట్టెమ్మ ఆదేశాల మేరకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ సంఘటనపై అమరావతి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.