క్రైమ్/లీగల్
కారు ఢీకొని మహిళ మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 9 December 2018
బచ్చన్నపేట, నవంబర్ 8: ప్రమాదవశాత్తు కారు ఢీకొట్టగా ఓ మహిళ మృతి చెందిన సంఘటన శనివారం గోపాల్నగర్లో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. గోపాల్నగర్కు చెందిన పుర్మ లక్ష్మమ్మ (70) తన ఇంటి ముందు ఆరుగుపై కూర్చోని ఉండగా చిన్నరామచర్ల గ్రామంవైపునుంచి వస్తున్న టిఎస్08ఎఫ్వి 8494 నెంబరుగల కారు ఆమెను వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ సంఘటనలో లక్ష్మమ్మ అక్కడిక్కడే మృతి చెందింది. కారు ప్రమాదానికి కారణమైన డ్రైవర్ యాదాధ్రి భువనగిరి జిల్లాకు చెందిన గౌరయపల్లి వాసి బోగ శ్రీనువాసును అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై రంజిత్రావు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.