క్రైమ్/లీగల్

ప్లాటినం పేర మోసానికి యత్నించిన ముఠా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం, డిసెంబర్ 9 : లక్షలాది రూపాయలు విలువ చేసే ప్లాటినం గుండ్లు ఇస్తామంటూ నమ్మబలికి రూ.15 లక్షల టోకరా వేయాలని ప్రయత్నించిన ముఠాపై బాధితులు ఫిర్యాదు చేయడంతో ఆదివారం అరెస్టు చేసినట్లు వన్‌టౌన్ సీఐ చిన్నగోవిందు తెలిపారు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. రామగిరికి చెందిన వీరేంద్రను అనంతపురం నగరానికి చెందిన పొబ్బల పార్వతమ్మతోపాటు బెంగళూరు, టుంకూరు, హిందూపురం ప్రాంతాలకు చెందిన నాగభూషణ్‌రెడ్డి, ఆర్‌కే శ్రీనివాసులు, డీహెచ్ నాగరాజు, ఆర్.శ్రీనివాసులు, ఈరన్న, ఎస్.ప్రకాశ్ ముఠాగా ఏర్పడి నకిలీ ప్లాటినం పోలికలతో ఉన్న గుండ్లను స్థానిక గుడ్డం రంగనాథస్వామి దేవాలయం వద్ద వీరేంద్రకు ఇచ్చారు. అయితే వాటిని పరిశీలించిన వీరేంద్రకు అనుమానం వచ్చింది. అవి నకిలీ గుండ్లుగా తెలుసుకుని నిందితులకు తెలియకుండా పోలీసులకు సమాచారం అందజేశారు. వన్‌టౌన్ చిన్న గోవిందు నేతృత్వంలో ఎస్సై మక్బూల్‌బాషా సిబ్బంది అక్కడికి వెళ్లి ఆ ముఠాను అరెస్టు చేశారు.