క్రైమ్/లీగల్

రోడ్డుప్రమాదంలో యువకుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గిద్దలూరు, డిసెంబర్ 9 : మోటార్‌బైక్ అదుపుతప్పి బోల్తాపడిన సంఘటనలో ఒకరు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మండల పరిధిలోని వెల్లుపలి అటవీప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గిద్దలూరు నగర పంచాయతీలోని పాండురంగారెడ్డినగర్‌కు చెందిన మహేష్ (20) అనే యువకుడు, అఫ్జల్ అనే మరో యువకుడు కలిసి మోటార్‌బైక్‌పై ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో నల్లమల అటవీ ప్రాంతంలోని నెమలిగుండ్ల రంగనాయకస్వామి దేవస్థానానికి వెళ్లారు. కొంత సమయం గడిచిన అనంతరం వారు తిరిగి వస్తుండగా వెల్లుపల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో వారు ప్రయాణిస్తున్న మోటార్‌బైక్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ సంఘటనలో మహేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. అఫ్జల్ అనే యువకుడి తలకు తీవ్రగాయాలు కావడంతో గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స అనంతరం పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మహేష్, అఫ్జల్ ఇద్దరూ గిద్దలూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ సెకండియర్ చదువుతున్నారు. మహేష్ తండ్రి గిద్దలూరు నగర పంచాయతీలో వాటర్‌ట్యాంకు ఏర్పాటుచేసి జీవనం సాగిస్తున్నాడు. ఈ సంఘటన సమాచారం రాత్రి 8 గంటల సమయంలో తెలియడంతో కుటుంబసభ్యులు బోరున విలపిస్తున్నారు. ఈ సమాచారం ఆలస్యంగా తెలియడంతో పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి మహేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఎస్సై మల్లికార్జున్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.