క్రైమ్/లీగల్

ద్విచక్రవాహనాలు ఢీకొని వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీరాల, డిసెంబర్ 9 : రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన కారంచేడు మండలంల పోతినవారిపాలెం గ్రామం వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఆదివారం సాయంత్రం వేటపాలెం మండలం కొత్తపేటకు చెందిన పిక్కిలి సురేష్(42) తన భార్య కృష్ణవేణితో ద్విచక్రవాహనంపై దగ్గుబాడు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో పోతినవారిపాలెం గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొనడం జరిగింది. ఈ ఘటనలో సురేష్ అక్కడికక్కడే మృతి చెందగా కృష్ణవేణికి తీవ్రగాయాలయ్యాయి. అంతేగాకుండా ఎదురుగా వస్తున్న మరో ద్విచక్రవాహన దారుడుకి తీవ్ర గాయాలయ్యాయి. 108 సిబ్బంది గాయాలపాలైన ఇరువురిని చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మరో ద్విచక్రవాహనంపై వస్తున్న వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో అతనిని మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.