క్రైమ్/లీగల్

ఏలూరు కాలువలో వ్యక్తి గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హనుమాన్ జంక్షన్, మార్చి 9: బాపులపాడు మండలం వీరవల్లి శివారు గ్రామం మురళీపురం వద్ద ఏలూరు కాలువలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం తోటగూడెం గ్రామానికి చెందిన కూలీలు శుక్రవారం కాలువలో తూడుకాడ తొలగిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. హనుమాన్ జంక్షన్ ఫైర్ అఫీసర్ పవన్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం తోటగూడెంకి చెందిన నలుగురు కూలీలు మేరుగు వెంకటేశ్వరరావు, గంగాడ కృష్ణ, నెరుసు శ్రీను, కొలకవారి ఏసుపాదం మురళీపురం వద్ద ఏలూరు కాలువలో తూడుకాడ తొలిగిస్తున్నారు. ఈ సమయంలో మేరుగు వెంకటేశ్వరరావు కాలువలో మునిగిపోయాడు. తోటి కార్మికులు గమనించే లోపు వెంకటేశ్వరరావు కనిపించకుండా పోయాడు. కార్మికులు గ్రామస్థుల సహాయంతో జంక్షన్ ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. వెంకటేశ్వరరావు అచూకీ లభించకపోవడంతో మచిలీపట్నం నుంచి విపత్తు నివారణ దళ సభ్యులు సంఘటన జరిగిన ప్రదేశానికి చేరుకుని గాలించినా వెంకటేశ్వరరావు అచూకీ లభ్యం కాలేదు. చీకటి పడడంతో గాలింపు నిలిపివేశారు. శనివారం ఉదయం తిరిగి గాలింపు చర్యలు ప్రారంభిస్తామని ఫైర్ అఫీసర్ పవన్ తెలిపారు.