క్రైమ్/లీగల్

హత్యకేసు కొట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం టౌన్, డిసెంబర్ 17 : గిద్దలూరు పోలీసులు 2015 ఫిబ్రవరి 2వ తేదీన నమోదు చేసిన హత్యకేసును మార్కాపురం 6వ అదనపు జిల్లా జడ్జి రామకృష్ణ సోమవారం నేరం రుజువు కాకపోవడంతో కొట్టివేస్తూ తీర్పు చెప్పారు. నిందితుడి తరపు న్యాయవాది భూపని కాశయ్య, విజయవర్దన్ తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. బిల్లు రాజశేఖర్, జెకె ప్రశాంత్, డి వెంకటేశ్వర్లు కలిసి మహానంది మండలం గోపవరంకు చెందిన టి జహీర్‌హుస్సేన్ ఆటోను బాడుగకు మాట్లాడుకొని గిద్దలూరు మండలం దిగువమెట్ట వద్దకు వచ్చారు. సదరు ఆటోను దొంగతనం చేసేందుకు ఆటోడ్రైవర్ జహీర్‌ను హత్య చేశారని గిద్దలూరు పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. కేసులో సాక్షాలు రుజువు కాకపోవడంతో సోమవారం 6వ అదనపు జిల్లా జడ్జి రామకృష్ణ కేసును కొట్టివేస్తూ తీర్పు చెప్పారని వారు తెలిపారు.