క్రైమ్/లీగల్

రైలుకింద పడి వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లిటౌన్, డిసెంబర్ 17: స్థానిక లక్ష్మీదేవిపేట సమీపంలో రైల్వేట్రాక్‌పై సోమవారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు రైలుకింద పడి మృతిచెందిన సంఘటన చోటుచేసుకుంది. రైల్వే జిఆర్‌పి ఎస్‌ఐ కామేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం లక్ష్మీదేవిపేట ఎఎంసి కాలనీకి చెందిన బండి వెంకటరమణ (30) కూలి పని కోసం తెల్లవారు ఐదు గంటలకు ప్రతీరోజు రైలులో వెళుతుంటాడు. రోజు మాదిరిగానే సోమవారం కూలి పనికి వెళుతుండగా వర్షాలు, ఈదురుగాలుల కారణంగా రైలును గమనించకుండా వెంకటరమణ పట్టాలుదాటుతుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. వెంకటరమణకు తల్లిదండ్రులు, భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు రైల్వేపోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.