క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థిని దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, డిసెంబర్ 17: రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్ధిని దుర్మరణం చెందిన సంఘటన మేడిపల్లి పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం పెద్దపల్లికి చెందిన అశ్ఛిత (18) వరంగల్‌లోని వాసుదేవ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. సోమవారం ఇక్కడ పరీక్ష రాయడానికి వచ్చిన ఆమెను బంధువు శివాజీ బైక్‌పై మేడిపల్లి నుంచి ఉప్పల్ వైపుకు వెళ్తుండగా ప్రమాదవశాత్తు బోడుప్పల్ చౌరస్తాలోని సిగ్నల్స్ వద్ద లారీ ఢీకొని ఎగిరి కింద పడ్డారు. అశ్ఛితపై నుంచి టైర్లు పోవడంతో ఆమె అక్కడిక్కడే మరణించింది. బైక్ నడుపుతున్న శివాజీ ఎలాంటి ప్రమాదం లేకుండా ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ అంజిరెడ్డి తెలిపారు.