క్రైమ్/లీగల్

ప్రమాదవశాత్తు బావిలో పడి వృద్దురాలు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెర్లాం, డిసెంబర్ 19: ప్రమాదవశాత్తు వృద్దురాలు బావిలో పడి మృతిచెందిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి ఎస్‌ఐ శ్రీనివాసరావు అందించిన వివరాల ప్రకారం మండలంలోని పెరుమాళి గ్రామానికి చెందిన బెవర పోలిపల్లిమ్మ(72) ప్రమాదవశాత్తు కాలిజారి బావిలో పడి మృతిచెందిందన్నారు. ఈమెకు నలుగురు పిల్లలున్నారు. అందులో ముగ్గురు పిల్లలు విజయవాడలో నివాసం ఉంటున్నారని, నాల్గవ కుమారుడు బెవర సత్యనారాయణ వద్ద పోలిపల్లిమ్మ ఉంటుందన్నారు. బుధవారం తెల్లవారుజామున 5గంటలకు బహిర్భూమికి వెళుతుండగా ప్రమాదవశాత్తు బావిలో పడిపోయింది. బావిలో పడటాన్ని చూసిన కొర్రిజన్ని శంకరరావు అందరికీ తెలియజేయడంతో బావిలో వెతకగా కనిపించలేదు. దీంతో రెండు ఇంజన్లతో బావిలోని నీటిని తోడించి బయటకు తీసేసరికి మృతిచెందిందన్నారు. మృతురాలి కుమారుడు సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం బాడంగి సిహెచ్‌సీకి తరలించారన్నారు.