క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలకొండ (టౌన్), డిసెంబర్ 19: పాలకొండ నుంచి వీరఘట్టం వెళ్లే రహదారిపై గజాలఖానా వద్ద బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం చిలకాం గ్రామానికి చెందిన అంపావిల్లి ఉమ పట్నాయక్ (32) మృతి చెందారు. వీరఘట్టం వైపు నుంచి వస్తున్న చెరకు లారీ పాలకొండ నుంచి వీరఘట్టం ద్విచక్ర వాహనంపై వెళుతున్న పట్నాయక్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే తీవ్ర గాయాలపాలై మృతి చెందాడు. ఎస్ ఐ వాసు నారాయణ సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
రెండు ద్విచక్రవాహనాలు ఢీ
* పలువురికి గాయాలు
పోలాకి, డిసెంబర్ 19: మండలంలో గల బెలమర గ్రామ సమీపాన నరసన్నపేట నుండి బెలమరవైపు సుమారు రాత్రి 8గంటలకు జీరు తేజేశ్వరరావు, కొడుకు రాజేష్ వస్తుండగా బొడ్డాం గ్రామం నుండి ఎదురుగా వస్తున్న పిట్టా అప్పలనాయుడు, శ్రీను ద్విచక్రవాహనం పై వచ్చి నేరుగా తేజేశ్వరరావు ద్విచక్రవాహనాన్ని ఢీకొనగా పలువురుకు తీవ్ర గాయాలయ్యాయి. గాయలైన అనంతరం 108 వాహనానికి ఫోన్ చేయగా సిబ్బంది వచ్చి గాయపడిన ఇరువురిని నరసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతం నరసన్నపేట నుండి శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని స్తానిక పోలీస్ హెడ్ కానిస్టేబుల్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈయనతో పాటు సిబ్బంది రమేష్, రమణమూర్తి, పలువురు పాల్గొన్నారు.