క్రైమ్/లీగల్

అనంతలో పరువు హత్య!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గార్లదినె్న: అనంతపురం జిల్లాలో బుధవారం ఘోరం జరిగింది. కులం కాని వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుందని కక్షగట్టిన సోదరుడు చెల్లి, ఆమె ఇద్దరు పిల్లలను కొడవలితో నరికి చంపాడు. అనంతపురం జిల్లా గార్లదినె్నలో నివాసముంటున్న బోయ నల్లప్ప భార్య మీనాక్షి (24), ఆమె పిల్లలు వితేష్(3), కీర్తి(1)ని సోదరుడి వరుసయ్యే హరి దారుణంగా నరికి చంపారు. పోలీసులు, ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పామిడి మండలం పీ.కొత్తపల్లికి చెందిన గొల్ల శివయ్య, పార్వతమ్మ దంపతుల నాల్గవ కూతురు మీనాక్షి అనంతపురంలో చదువుకునే సమయంలో గార్లదినె్నకు చెందిన బోయ నల్లప్పతో పరిచయమైంది. అది కాస్త ప్రేమగా మారిన నాలుగేళ్ల క్రితం ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరికి వితేష్, కీర్తి పిల్లలు. కొద్ది రోజుల తరువాత వీరి పెళ్లిని మీనాక్షి తల్లిదండ్రులు అంగీకరించారు. అయితే గొల్ల శివయ్య తమ్ముడి కొడుకు హరి ఈ పెళ్లిని వ్యతిరేకించాడు. కులం కాని వాడిని మీనాక్షి ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక పలుసార్లు బెదిరించినట్లు సమాచారం. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో గార్లదినె్నలోని మీనాక్షి ఇంటికి వచ్చిన హరి వెంట తెచ్చిన కొడవలితో తొలుత మీనాక్షి గొంతు కోశాడు. అనంతరం అక్కడే ఉన్న పిల్లలు వితేష్, కీర్తి గొంతుకోశాడు. ఇంతలో నల్లప్ప తల్లి సుబ్బమ్మ ఇంట్లోకి రావడంతో కొడవలిని దాచుకుని మోటార్‌బైక్‌పై పరారయ్యాడు. సుబ్బమ్మ కంగారుగా లోపలికి వెళ్లి చూడగా రక్తపుమడుగులో మీనాక్షి, ఇద్దరు పిల్లలు కనిపించారు. దీంతో ఆమె గట్టిగా కేకలు వేస్తూ విలిపించడంతో చుట్టుపక్కలవారు పోగయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలియగానే ఎస్పీ అశోక్‌కుమార్, డీఎస్పీ వెంకటరావు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. డాగ్‌స్వ్కాడ్‌ను రంగంలోకి దింపారు. నిందితుడిగా భావిస్తున్న హరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
కాగా మీనాక్షి తాను ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక బావమరిది హరి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని మృతురాలి భర్త నల్లప్ప ఆరోపించారు. మీనాక్షి తాను ఇష్టపూర్వకంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నామన్నారు. అయితే బావమరిది హరి తమ పెళ్లిని తొలినుంచి వ్యతిరేకించాడన్నారు. గతంలో రెండు సార్లు బెదిరించాడన్నారు. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన భార్య మీనాక్షి, ఇద్దరు పిల్లలను నరికి చంపాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నల్లప్ప ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు
చిత్రం..రక్తపుమడుగులో మీనాక్షి, పిల్లలు