క్రైమ్/లీగల్

భారీగా రేషన్ బియ్యం స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాగజ్‌నగర్, డిసెంబర్ 20: తెలంగాణ నుండి మహారాష్టక్రు వివిధ రైళ్లలో అక్రమంగా తరలిస్తున్న 300 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని బుధవారం రాత్రి స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్, రైల్వే పోలీసులు పట్టుకున్నారు. కాగజ్‌నగర్ రైల్వే ఆర్‌పిఎఫ్ పోలీసుల సమాచారం మేరకు వరంగల్, పెద్దపల్లి, మంచిర్యాల, కుమ్రంభీం, జిల్లాల నుండి నిత్యం అక్రమంగా రవాణా అవుతున్న రేషన్ బియ్యం మహారాష్టల్రోని వీరూర్ సమీపంలో డంప్‌చేసి 18 రూపాయల నుండి 20 రూపాయలకు అమ్ముతున్నారని అందిన సమాచారం మేరకు హైదరాబాద్ సివిల్ సప్లైస్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి రాజేశం, కాగజ్‌నగర్ ఆర్‌పిఎఫ్ ఎస్సై ఎంవీ రాథోడ్ దాడులు చేయగా, దాదాపు 300క్వింటాళ్ల (సుమారు రూ.2లక్షలు) బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈబియ్యాన్ని కాగజ్‌నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే స్పాయింట్ కార్యాలయానికి తరలించినట్లు వారు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీదలకు అందిస్తున్న రేషన్ బియ్యాన్ని దళారులు 12 నుండి 15 వరకు కొనుగోలు చేసి 18 నుండి 20 రూపాయలకు వరకు అమ్ముతున్నారని అక్రమ దందా చేసే దళారులను వ్యాపారులను వదిలి పెట్టమని సివిల్ సప్ల్యై ఎన్ ఫోర్స్‌మెంట్ అదికారి ఈ సందర్బంగా హెచ్చరించారు.