క్రైమ్/లీగల్

మహిళ దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్ రూరల్, డిసెంబర్ 20: మహిళను దారుణంగా హత్యచేసిన సంఘటన మండలంలోని జానకంపల్లిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. మెదక్ రూరల్ పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన మార్గం గంగయ్యకు కౌడిపల్లికి చెందిన లక్ష్మీ, భూమయ్యల కూతురు లక్ష్మీ(35)ను 18 సంవత్సరాల క్రితం వివాహం జరిపించారు. గత సంవత్సరం గంగయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. పెద్ద కుమారుడిని తూప్రాన్ హాస్టల్‌లో చేర్పించగా చిన్నకుమారుడితో కలిసి జానకంపల్లిలోని తన పూరిగుడిసెలో నివసిస్తుంది. కాగా లక్ష్మీతో మామ మార్గం పోచయ్య, మరిది సిద్దిరాములు మధ్య బుధవారం గొడవపడ్డారు. రాత్రి చీకటి వేళ లక్ష్మీ బయటకు రాగా కాపుగాచి మామ, మరిదిలో కర్రలతో గాయపర్చడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న రూరల్ సిఐ రాజశేఖర్, హవేళీఘణాపూర్ ఎస్‌ఐ శ్రీకాంత్‌లు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మెదక్ ఆసుపత్రికి తరలించారు. గురువారం మృతురాలి బంధువులు గ్రామానికి వచ్చి చూడగా మామ, మరిదిల ఇళ్లపై దాడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తాళం ఉండడంతో మరుగుదొడ్లను ధ్వంసం చేశారు. వారు పరారైనట్లు గ్రామస్థులు తెలిపారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో గ్రామానికి డీఎస్‌పీ కృష్ణమూర్తి, సీఐ రాజశేఖర్, పలువురు ఎస్‌ఐలు పోలీసు బలగాలతో వెళ్లారు. పరిస్థితి చేజారకుండా చక్కదిద్దారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. కాగా అక్రమ సంబంధమే హత్యకు దారితీసినట్లుం సమాచారం. నిందితులను అరెస్టుచేస్తే పూర్తి వివరాలు తెలుస్తాయి.