క్రైమ్/లీగల్

మహిళ ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరాపురం, డిసెంబర్ 20 : మండల పరిధిలోని గొల్లమారనపల్లికి చెందిన రంగమ్మ (52) బుధవారం కడుపునొప్పి తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారు తెలిపిన వివరాల మేరకు చాలాఏళ్లుగా రంగమ్మకు కడుపునొప్పి వస్తుండేదన్నారు. బుధవారం ఉన్నఫళంగా కడుపునొప్పి రావడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకుంటున్న కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే టుంకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కొళాయి గుంతలో పడి చిన్నారి మృతి
ఉరవకొండ, డిసెంబర్ 20 : ఇంటి ముందు ఉన్న పబ్లిక్ కొళాయి నీటి గుంతలో పడి చిన్నారి మృతి చెందిన ఘటన గురువారం పట్టణంలో చోటు చేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల మేరకు రాయదుర్గానికి చెందిన వడ్డే రాజశేఖర్, నిర్మలా దంపతులు జీవనోపాధి నిమిత్తం వచ్చి ఉరవకొండలోని మాస్టర్ సీవీవీ నగర్‌లో నివాసం ఉంటున్నారు. ఈనేపథ్యంలో రాజశేఖర్ తనయుడు రాజేంద్రకుమార్ (2) ఇంటి ముందు ఉన్న పబ్లిక్ కొళాయి నీటి గుంతల్లో జారి పడ్డాడు. రెండు గంటల తర్వాత గమణించిన కుటుంబ సభ్యులు చుట్టు పక్కల వెతికారు. నీటి గుంతలో పడి మృతి చెందడాన్ని గమణించి బోరున విలపించారు.