క్రైమ్/లీగల్

భార్య మృతిచెందిదనే మనస్థాపంతో భర్త మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గిద్దలూరు, డిసెంబర్ 20: భార్య మృతిచెందిందని మనస్థాపం చెంది భర్త కూడా మృతిచెందిన సంఘటన గురువారం గిద్దలూరు పట్టణంలో చోటుచేసుకుంది. గిద్దలూరు పట్టణంలో ఫ్రెండ్స్ సెంటర్‌లో బొరుగుల బండి నడుపుకుంటున్న పర్చూరి రామయ్య భార్య నారాయణమ్మ (66) గురువారం ఉదయం అనారోగ్యంతో మృతిచెందింది. భార్య మృతి చెందడంతో మనస్థాపంతో రామయ్య (76) గురువారం సాయంత్రం మృతి చెందాడు. ఒకేసారి భార్య భర్త ఇరువురూ మృతిచెందారు. వారికి స్థానికులు దహన సంస్కారాలు నిర్వహించారు. వారికి ఒక కుమార్తె ఉంది. భార్యాభర్తలు ఒకేసారి చనిపోవడంతో పలువురు ప్రగాఢ సంతాపం తెలిపారు.

చలి తీవ్రత తట్టుకోలేక వృద్ధుడు మృతి
తర్లుపాడు, డిసెంబర్ 20: చలి తీవ్రతను తట్టుకోలేక వృద్ధుడు మృతిచెందిన సంఘటన గురువారం ఉదయం మండలంలోని ఉమ్మారెడ్డిపల్లిలో చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన తాడి పెద్దకొండారెడ్డి (66) చలితీవ్రత తట్టులేక మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. గత వారంరోజుల నుంచి వీస్తున్న చలిగాలులకు తట్టుకోలేక పెద్దకొండారెడ్డి మృతిచెందినట్లు తెలిపారు.