క్రైమ్/లీగల్

బ్రెయిన్ డెడ్‌తో బాలిక మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొయ్యూరు, డిసెంబర్ 20: కొయ్యూరు గ్రామానికి చెందిన గంగిశెట్టి శ్రావ్యశ్రీ(3) మెదడు సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ మృతి చెందింది. జ్వరంతో బాధపడుతున్న బాలికను తండ్రి చిరంజీవి మెరుగైన వైద్య సేవలకై తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు గత 15 రోజుల క్రితం తరలించారు. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య సేవలందింప చేసారు. మొదట డెంగ్యూ జ్వర లక్షణాలు ఉన్నాయని వైద్యం అందించినట్లుగా ఆయన తెలిపారు. అనంతరం 10 రోజుల తరువాత బాలిక పరిస్థితి విషమంగా మారడంతో విజయవాడకు తరలించి వైద్య సేవలందింప చేసారు. శ్రావ్యశ్రీకి బ్రెయిన్ డెడ్ అయ్యి ఆర్గాన్స్‌పని చేయడం లేదని అక్కడి వైద్య నిపుణులు తెలిపారన్నారు. లక్షలాది రూపాయలు ఖర్చు చేసినా ఫలితం లేకపోయిందని, వైద్య సేవలు పొందుతూనే 17న బాలిక మృతి చెందిందని తల్లిదండ్రులు విలపిస్తూ తెలిపారు. నిత్యం కళ్ళ ముందే ఆడుతూ ఉండే చిన్నారి మృతి చెందడం జీర్ణించుకోలేక తల్లిదండ్రులు విలపిస్తున్న తీరు చూపరులను కలిచివేస్తోంది.