క్రైమ్/లీగల్

ఆటో బోల్తా..ఒకరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముదిగుబ్బ, మార్చి 11 : ముదిగుబ్బ పాతూరులో ఆదివారం ఆటో అదుపుతప్పి బోల్తా పడటంతో వెంకటేష్‌నాయక్ (33) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్సై మహమ్మద్ గౌస్ తెలిపిన మేరకు ముదిగుబ్బ నుంచి మంగలమడకకు వెళ్తున్న ఆటోలో పొడరాళ్లపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్‌నాయక్‌తోపాటు మరో నలుగురు ప్రయాణిస్తుండగా పాతూరు సమీపంలో కుక్క అడ్డం రావడంతో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో వెంకటేష్‌నాయక్ అక్కడికక్కడే మృతి చెందగా గాయాలైనవారిని చికిత్స కోసం బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై వివరించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పంచనామా నిమిత్తం కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.
వ్యక్తి ఆత్మహత్య
కదిరి, మార్చి 11 : మున్సిపల్ పరిధిలోని కుటాగుళ్ల సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి ఆదివారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి వయస్సు 42 సంవత్సరాలు వుండవచ్చని, ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉందని రైల్వే పోలీసులు తెలిపారు.