క్రైమ్/లీగల్

తారస్థాయికి కేబుల్ వార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, డిసెంబర్ 20: జిల్లాలో కేబుల్ ఆపరేటర్ల మధ్య వ్యాపారపరంగా నెలకొన్న ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. ఇప్పటికే స్థానికంగా కేబుళ్లను నిర్వహిస్తున్న ఆపరేటర్లు పరస్పర దాడులు, కేబుల్ వైర్ల కత్తిరింపుల ద్వారా పైచేయిని చాటుకునే ప్రయత్నాలు కొనసాగించగా, ప్రస్తుతం ఏకంగా గోడౌన్లకు నిప్పంటించి కోట్లాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లేలా వ్యవహరించడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. సుభాష్‌నగర్‌లోని ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్‌కు సమీపంలో గల జీటీపీఎల్ కేబుల్ సంస్థకు చెందిన గోడౌన్‌కు గుర్తు తెలియని ముగ్గురు దుండగులు బుధవారం అర్ధరాత్రి సమయంలో నిప్పంటించారు. రెండు ద్విచక్ర వాహనాలపై వచ్చిన ఆగంతకులు వెంటిలేటర్ గుండా కిరోసిన్ చల్లి నిప్పంటించడంతో, గోడౌన్‌లో నిల్వ ఉంచిన వేలాది సెట్‌అప్ బాక్సులు, కేబుల్ వైర్లు, ఇతర సామాగ్రి మొత్తం దగ్ధమైంది.
ఈ సంఘటనలో సుమారు 3.35కోట్ల రూపాయల ఆస్తినష్టం వాటిల్లిందని కేబుల్ సంస్థ వ్యాపారి చామకూర రాజేందర్‌రెడ్డి త్రీటౌన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అర్ధరాత్రి సమయంలో గోడౌన్ నుండి మంటలు రావడాన్ని గమనించిన గోదాం ఇన్‌చార్జి అయోధ్య గణేష్‌రెడ్డి వెంటనే తన యజమాని రాజేందర్‌రెడ్డికి ఫోన్ చేయగా, ఆయన హుటాహుటిన చేరుకుని ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. అగ్నిమాపక శకటాలు మంటలను ఆర్పివేయగా, అప్పటికే జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది.
ఈ గోడౌన్‌కు ఆనుకుని ఉన్న రామాలయం, సుభాష్‌జిమ్‌తో పాటు గోడౌన్‌లోని సీ.సీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించగా, ముగ్గురు వ్యక్తులు రెండు ద్విచక్ర వాహనాలపై గోడౌన్ వద్దకు చేరుకుని వెంటిలేటర్ గుండా కిరోసిన్‌ను చల్లి నిప్పంటించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. కాగా, తమ కేబుల్ ఛానెల్ సంస్థ దినదినం అభివృద్ధి చెందుతుండడాన్ని చూసి జీర్ణించుకోలేక పోటీ సంస్థ అయిన భారతీ ఛానెల్, విశ్వ డిజిటల్ ఛానెల్స్‌కు చెందిన గాదె కృష్ణ, ఏలేటి శ్రీనివాస్‌రెడ్డి, సిర్ప రాజు, బీ.రాజేంద్రప్రసాద్ అలియాస్ ఆకాష్‌లు కక్షపూరితంగా తమ అనుచరులతో ఈ దారుణాన్ని జరిపించి ఉంటారని జీటీపీఎల్ యజమాని రాజేందర్‌రెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అనుమానాలు వెలిబుచ్చారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని, తనకు న్యాయం చేయాలని కోరారు.
ఈ మేరకు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నామని త్రీటౌన్ పోలీసులు తెలిపారు.
చిత్రం..గోడౌన్‌కు నిప్పంటించడంతో దగ్ధమైన సెట్‌ఆఫ్ బాక్సులు