క్రైమ్/లీగల్
భవనం పైనుంచి పడి వ్యక్తి మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 12 March 2018
కౌడిపల్లి, మార్చి 11. ప్రమాదవశాత్తూ భవనంపై నుంచి కింద పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన చిలప్చెడ్ మండలంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. అందోల్ మండల కేంద్రానికి చెందిన మొలమోళ్ల నాగరాజు (40) చిలప్చెడ్ మండలం సోమక్కపేటలోని తన బంధువులైన భవాని బిక్షపతి ఇంట్లో పండుగ కార్యక్రమానికి వచ్చాడు. శనివారం రాత్రి భోజనం చేసిన అనంతరం పడుకునేందుకు మేడ (డాబా) పైకి వెళ్ళి పడుకున్నాడు. శనివారం రాత్రి తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో మూత్రం చేయడానికి నిద్రలో నుంచి లేచాడు. ప్రమాదవశాత్తూ మేడ పైనుంచి కింద పడ్డాడు. తలకు బలమైన గాయాలు కావడంతో నాగరాజు మృతి చెందాడు. కుటుంబీకుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.ఐ. మల్లయ్య తెలిపారు.