క్రైమ్/లీగల్

భూకబ్జాదారుల అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, డిసెంబర్ 25: నలుగురు భూకబ్జాదారులను జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. గాజులరామారం డివిజన్ కైసర్‌నగర్, కట్టమైసమ్మ బస్తీల్లోని ప్రభుత్వ భూములను ఆక్రమించి అమాయకులకు విక్రయించిన నలుగురిపై కుత్బుల్లాపూర్ మండల తహశీల్దార్ గౌతమ్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత మూడు రోజుల క్రితం రెవెన్యూ అధికారులు అక్రమంగా నిర్మించిన నిర్మాణాల కూల్చివేతలు చేపట్టారు. అధికారులను అడ్డుకోవడంతో పాటు దాడికి యత్నించారు. తహశీల్దార్ గౌతమ్‌కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు గడ్డం కృష్ణ, రహీమునీసా, కరీమునీసా, అనిఫాను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.