క్రైమ్/లీగల్

మంచుతో రోడ్డు ప్రమాదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, డిసెంబర్ 28: రాజేంద్రనగర్ సర్కిల్ పరిసర ప్రాంతాల్లో తెల్లవారుజామున ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగిపోతుంది. కొన్ని రోజులుగా తెల్లవారుజాము నుంచి 10 గంటల వరకు దట్టమైన మంచులో ప్రయాణించాలంటే ప్రజలకు కత్తిమీద సాములాగా ఉంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మంచులో ప్రయాణం చేయడం కష్టంగా మారింది. మంచులో ప్రయాణం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రమాదాలకు కారణాల గురించి ప్రజల నుంచి విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పొగ మంచులో వేగంగా ప్రయాణం చేయటం, నైపుణ్యం లేని శోధన ప్రమాదాలకు ముఖ్య కారణంగా చెప్పవచ్చు. మంచు కురుస్తున్న సమయంలో రహదారులపై వాహనాలను నిలిపి ఉంచటం దగ్గరకు వచ్చేవరకు నిలిపి ఉన్న వాహనం కనిపించకపోవడం ప్రమాదాలకు మరో కారణంగా చెప్పవచ్చు. రహదారుల వెంట మంచులోను, చీకట్లోను కనపడే విధంగా అధికారులు రేడియం స్టిక్కర్లు, ప్రమాద సూచికలు ఏర్పాటు చేసినప్పటికీ కొంతమంది ఆకతాయిలు వాటిని ధ్వంసం చేయడం ప్రమాదాలకు హేతువులుగా చెప్పవచ్చు. ఈ క్రమంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలను నివారించే అవకాశం ఉందని చెప్పవచ్చు.
జాగ్రత్తలు పాటించాలి: ఇన్‌స్పెక్టర్ సురేష్
పొగమంచు కారణంగా ప్రమాదాలకు గురి కాకుండా జాగ్రత్తలు పాటించాలని రాజేంద్రనగర్ పోలీసు ఇన్‌స్పెక్టర్ సురేష్ తెలిపారు. మంచుతెరలు మాయమయ్యే వరకు ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం తప్పనిసరి అని తెలిపారు. ఒకవేళ ప్రయాణం చేసినా తక్కువ వేగంతో ప్రయాణించడం మంచిదన్నారు. రోడ్డుకు ఎడమవైపున సాధ్యమైనంత వరకు మార్జిన్‌లో ప్రయాణించాలన్నారు. వాహనాలను ఎక్కడబడితే అక్కడ నిలిపివేయకపోవడం మంచిదన్నారు. లైట్లు వేసుకొని ప్రయాణించాలన్నారు. అద్దాలను తుడిచే వైబర్లు సక్రమంగా ఉంచుకోవడం, మోటార్ వెహికిల్స్‌లో ప్రయాణించేటప్పుడు వైబర్లు వేసి ఉంచడం కొంత వరకు ప్రమాదాలను నివారించవచ్చని అభిప్రాయం తెలిపారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించేటప్పుడు శరీరం మొత్తాన్ని కప్పి ఉంచేలా స్వెట్టర్లు, జర్కిన్లు, మంకీ క్యాపులు, చేతులకు గ్లౌజులు ధరించటం మంచిదన్నారు. మంచు రేణువులు శరీరంలోకి పోకుండా ముక్కుకు, నోటికి కర్చీప్‌లు కట్టుకోవడం, మాస్కులు ధరించడం ప్రయాణంలో సురక్షితమైన అంశాలుగా చెప్పవచ్చు. సాధ్యమైనంత వరకు మంచుతెరలు తొలగే వరకు ప్రయాణాన్ని ఆపివేయటం, తప్పనిసరి అయితే ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించడం మంచి లక్షణంగా చెప్పవచ్చు. బస్సులో ప్రయాణం పెద్ద వాహనం కనుక మంచు ప్రభావం ఎక్కువగా ఉండదని చెప్పారు.

విద్యార్థిని మృతి
ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 28: వంటింట్లో రిఫ్రిజిరేటర్ సిలిండర్ పేలి బీటెక్ విద్యార్థిని మృతిచెందిన సంఘటన ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మండల పరిధిలోని ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని బొంగ్లూరు గ్రామం మైహోమ్స్ కాలనీలో నివాసముండే నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన కొంపల్లి మనోహర్, లావణ్య దంపతుల కుమార్తె దీపిక(17) బీటెక్ ఫస్టియర్ చదువుతోంది. పరీక్షల సమయం కావడంతో గురువారం ఇంట్లోనే ఉండి చదువుకుంటోంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రిడ్జ్‌లో ఉన్న పులిహోర తినడానికి ప్రిడ్జ్‌ను తెరిచింది. ఫ్రిడ్జ్ సిలిండర్ ఒక్కసారిగా పేలింది. పేలుడు ధాటికి దీపిక పూర్తిగా కాలిపోయి ప్రాణాలు విడిచింది. ఇంట్లో పొగలు రావడం ఇరుగుపొరుగు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఇంటికి చేరుకునే లోపుగానే దీపిక పూర్తిగా కాలిపోయి విగతజీవిగా కనిపించింది. కూతురి మృతితో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆదిభట్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు.
ఒకేరోజు 800 ద్విచక్ర వాహనాల తనిఖీ

మెహిదీపట్నం, డిసెంబర్ 28: వరుస చైన్ స్నాచింగ్‌లతో మహిళలు భయాందోళనకు గురవుతున్నారు. కాగా గత రెండు రోజుల క్రితం వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో వరుస చైన్ స్నాచింగ్ చోటుచేసుకున్నాయి. దీంతో పోలీసులు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముందుస్తుగానే రోడ్లపై ద్విచక్రవాహనాల తనిఖీలు చేపడుతున్నారు. వివరాల్లోకి వెళ్లితే.. నగరంలో రెండు రోజుల క్రితం చోటుచేసుకున్న వరుస చైన్ స్నాచింగ్‌లతో పశ్చిమ మండల పరిధిలోని డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు గురువారం, శుక్రవారం రెండు రోజుల్లో అన్ని పోలీస్‌స్టేషన్ పరిధిలో భారీగా పోలీసులు ద్విచక్ర వాహనాల తనిఖీలను చేపట్టారు. వాహనాలకు నెంబర్ ప్లేట్ లేని విరిగిన నెంబర్ ప్లేట్ వాహనాలను, సరియైన పత్రాలు లేకున్నా పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో పోలీసులు అన్ని ప్రాంతాలల్లో గల్లీగల్లీల్లో పెట్రోలింగ్ చేపడుతున్నారు. ఇదేమాదిరిగా నిత్యం పోలీసులు పెట్రోలింగ్‌లతో పాటు తనిఖీలు చేపడితే బాగుంటుందని స్థానికులు పోలీస్ ఉన్నతాధికారులను కోరుతున్నారు. నెంబర్ ప్లేట్ సరిగ్గా లేకుంటే వాహనాలను సీజ్ చేస్తామని పశ్చిమ మండల డీసీపీ ఎఆర్. శ్రీనివాస్ హెచ్చరించారు. హెల్మెట్ లేకుండా ద్విచక్రవాహనాలు నడిపిస్తున్న సమయంలో, రాంగ్ రూట్‌లో వస్తున్న వాహనాలను, రోడ్లపై అక్రమ పార్కింగ్‌చేసిన వాహనాలను ట్రాఫిక్ పోలీసులు ఫోటోలు తీస్తున్నారని కొంత మంది వాహనదారులు వారికి చాలాన్లు రాయకుండా వారి ద్విచక్ర వాహనాలకు నెంబర్ ప్లేట్‌ను సగం వరకు విరగ్గొట్టడం చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి వాహనాలను కూడా స్వాధీనం చేసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిన అవసరం ఉందని అన్నారు.