క్రైమ్/లీగల్

అప్పుల భారంతో రైతు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, జనవరి 8: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం గోపాల్‌రావుపల్లె గ్రామంలో అప్పుల బాధతో పంకరి మల్లయ్య (62) అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామ శ్మశానవాటికలోని షెడ్డులో మల్లయ్య ఉరి వేసుకుని మృతి చెందగా, మంగళవారం ఉదయం ఆయన మృతదేహంను కనుగొన్నారు. సోమవారం రాత్రి ఇంటిలో అందరు నిద్రించాక, మల్లయ్య ఇంటి బయట ప్రధాన ద్వారంకు గడియ పెట్టి వెళ్ళిపోయాడు. రాత్రి రెండు గంటల తర్వాత ఆయన భార్యకు మెలుకవ రావడంతో పక్కన మల్లయ్య కనిపించలేదు. మంగళవారం వేకువజామున శ్మశానవాటిక వద్ద ఉరి వేసుకుని కనిపించాడు. తంగళ్ళపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.