క్రైమ్/లీగల్

రైలు ఢీకొని తల్లీ కొడుకుల దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవీపేట, జనవరి 8: తన ప్రాణానికి ప్రమాదం అని తెలిసినా, మానసిక వికలాంగుడైన కుమారుడిని ఎలాగైనా కాపాడుకోవాలని ఓ తల్లి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పదేళ్ల కుమారుడితో పాటు ఆ తల్లి కూడా రైలు ఢీకొన్న ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం ఫకీరాబాద్ గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. రైల్వే ఎస్‌ఐ ప్రణయ్‌కుమార్ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఫకీరాబాద్ గ్రామానికి చెందిన వడ్డె గంగామణి (50), మానసిక వికలాంగుడైన ఆమె కుమారుడు గంగాప్రసాద్ (10)లు మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో గ్రామ సమీపంలోని రైల్వే గేటు ప్రాంతం వద్దకు వచ్చారు. మహారాష్ట్ర నుండి సికిందరాబాద్‌కు వెళ్లే దేవగిరి ఎక్స్‌ప్రెస్ రైలు వస్తుండడంతో గేటు వేశారు. దీంతో గంగామణి, ఆమె కుమారుడు అక్కడే కొద్దిసేపు ఆగారు. అంతలోనే మానసిక వికలాంగుడైన గంగాప్రసాద్ గేటు కింద నుండి దూరి పట్టాల పైకి వెళ్లగా, అదే సమయంలో రైలు చేరువగా వచ్చేసింది. ప్రమాదాన్ని గమనించిన గంగామణి తన కుమారుడిని వెనక్కి లాగేందుకు ఆమె కూడా పరుగుపరుగున పట్టాల వద్దకు వెళ్లగా, వీరిరువురిని అతివేగంగా దూసుకొచ్చిన దేవగిరి ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గంగామణి శరీర భాగం రెండుగా విడిపోగా, గంగాప్రసాద్ పేగులు బయటకు వచ్చి సంఘటనా స్థలం భీతావహ దృశ్యంగా మారింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని రైల్వే ఎస్‌ఐ ప్రణయ్‌కుమార్ తెలిపారు.