క్రైమ్/లీగల్

ఆర్టీసీ బస్సు బోల్తా: 20మందికి గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిట్రగుంట, జనవరి 8: నెల్లూరు జిల్లా బోగోలు మండలం ముంగమూరు క్రాస్ రోడ్డు జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సుమారు 21 మంది గాయపడ్డారు. బిట్రగుంట ఎస్సై అందించిన వివరాల మేరకు నెల్లూరు నుంచి కావలికి జ్యూస్ లోడుతో వెళ్లుతున్న కంటైనర్ లారీ ముంగమూరు క్రాస్ రోడ్డు వద్ద వచ్చే సమయంలో తూర్పు వైపునుంచి ద్విచక్ర వాహనదారుడు ఆకస్మాత్తుగా రావడం వల్ల దాన్ని తప్పించబోయి ఎదురు మార్గంలో విశాఖ పట్టణం నుంచి నెల్లూరుకు వస్తున్న అర్టీసీ బస్సును ఢీకొంది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు బోల్తాపడ్డాయి. బస్‌లో సుమారు 30మంది ప్రయాణికులు ఉన్నరని వారిలో 21మంది గాయపడ్డారని చెప్పారు. అయితే ఎవరికీ ప్రాణాపాయం లేదన్నారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యచికిత్స కోసం నెల్లూరు ప్రధాన ఆసుపత్రికి తరలించినట్టు ఎస్‌ఐ చెప్పారు.