క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరిగి, జనవరి 9: ట్రాక్టర్ - బైక్ ఢీకొని ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఎస్‌ఐ అరుణ్ కుమార్ తెలిపిన వివరాలు కొడంగల్ మండలం ఉస్సేన్‌పూర్ గ్రామానికి చెందిన మూర్తి కాశప్ప(25), ఎల్లప్ప(30) మొయినాబాద్‌లో రోజువారీ కూలీలుగా పని చేస్తున్నారు. బుధవారం రాత్రి ఉస్సేన్‌పూరు నుంచి ఇద్దరు మొయినాబాద్‌కు బైక్‌పై బయలుదేరారు. పూడూరు మండలం చీలాపూర్ స్టేజ సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న పత్తిలోడ్‌తో ఉన్న ట్రాక్టర్ ఢీకొట్టింది. బైక్‌పై ఉన్న ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. ఎల్లప్ప తల తెగి అక్కడే పడింది. దాదాపు గంట సేపు జాతీయ రహదారి రక్తసిక్తంగా మారి రాకపోకలకు ఇబ్బందిగా మారింది. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.