క్రైమ్/లీగల్
15 గంటలు.. 11 గొలుసులు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 10 January 2019
హైదరాబాద్, జనవరి 9: జంటనగరాల్లో గొలుసు దొంగతనాలకు పాల్పడుతూ మహిళలను భయకంపితులను చేస్తున్న గొలుసు దొంగలను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణకు వలస వచ్చిన ఉత్తర ప్రదేశ్కు చెందిన వాల్మీకి అలియాస్ రాహుల్, ప్రణీత్ చౌదరి అలియాస్ మాన్యలు రహదార్లపై వెళుతున్న మహిళలను టార్గెట్ చేస్తూ బైకులపై దర్జాగా వెళ్లూ మహిళలను దోచుకునేవారు. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫొటోలను పోలీసులు గుర్తించారు. వీరిని పట్టుకోవడానకి 120 పోలీస్ బృందాలు పని చేశాయి. వీరిని గుర్తించడానికి 600 సీసీ కెమెరాల నుంచి ఫొటోలను పరిశీలించారు. పట్టుబడిన ఇదరిని బుధవారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మీడియా ముందుకు తెచ్చారు. నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.