క్రైమ్/లీగల్
ప్రయాణికులపైకి దూసుకెళ్లిన కారు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 10 January 2019
సోమందేపల్లి, జనవరి 9: ఆర్టీసీ బస్సు కోసం రోడ్డువారగా నిలుచున్న ప్రయాణికులపైకి కారు దూసుకెళ్లిన సంఘటనలో నవవధువుతో పాటు మరొకరు మృతి చెందారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం పాపిరెడ్డిపల్లి సమీపంలో బుధవారం జరిగింది. జాతీయ రహదారిపై వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి నిలుచున్న వారిపైకి దూసుకెళ్లడంతో గ్రామానికి నరసమ్మ(53), ఆమె కూతురు భారతి(29) మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. భారతికి బుక్కపట్నం మండలానికి చెందిన వెంకటరాముడుతో మూడు రోజుల క్రితం పెళ్లయింది. భర్త, తల్లిదండ్రులతో కలిసి భారతి మెట్టినింటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాదంలో భారతి మృతి, ఆమె తల్లి మృతి చెందగా, భర్త వెంకటరాముడు, తండ్రి అంజినప్ప, సోదరి శిరీష తీవ్రంగా గాయపడ్డారు.