క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో యువతీ యువకుల దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధవళేశ్వరం, జనవరి 9: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ మండలం ధవళేశ్వరం గ్రామంలో బుధవారం కంటైనర్ లారీ స్కూటర్‌ను ఢీకొన్న ప్రమాదంలో యువతీ యువకులు దుర్మరణం చెందారు. పోలీసుల కథనం ప్రకారం కడియం మండలం పొట్టిలంక గ్రామానికి చెందిన ఆనం స్వరూప (17) రాజమహేంద్రవరంలోని ఒక ప్రైవేటు కళాశాలలో బిఎస్సీ మొదటి సంవత్సరం చదువుతోంది. బుధవారం ఉదయం కళాశాలకు వచ్చిన ఆమె మధ్యాహ్నం సమయంలో తన సమీప బంధువు నక్కిన మల్లికార్జునరావు (18)తో కలిసి స్కూటర్‌పై స్వగ్రామం వెళ్తుండగా వెనుక నుండి కంటైనర్ లారీ ఢీకొంది.
ఈ ప్రమాదంలో స్వరూప, మల్లికార్జునరావు అక్కడికక్కడే మృతిచెందారు. కాగా కళాశాలకు ఆలస్యంగా వచ్చిందని స్వరూపను డైరెక్టర్ లోనికి అనుమతించకపోవడంవల్లే ఈదుర్ఘటన జరిగిందని ఆరోపిస్తూ కళాశాల విద్యార్థులు రాస్తారోకో చేశారు. ఆలస్యంగా వచ్చిందని కళాశాల బయట నిల్చోపెట్టడంవల్ల అవమానానికి గురై, చేసేది లేక ఇంటికి తిరిగివెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని విద్యార్థులు ఆరోపించారు.
స్వరూపను కళాశాలలోకి అనుతించివుంటే ఈ ప్రమాదం జరిగివుండేది కాదని విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేశారు.