క్రైమ్/లీగల్

లాటరీ పేరుతో టోకరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జనవరి 9: కోకాకోలా లాటరీ వచ్చిందంటూ యువకులకు టోకరా వేస్తున్న నైజీరియన్ సైబర్ మోసగాడు ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు. ఇతనితో పాటు నాగాలాండ్‌కు చెందిన ఓ యువతిని కూడా బుధవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ సైబర్ పోలీసుల సహకారంతో శాయంపేట పోలీసులు ఢిల్లీలో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన ఇద్దరి నిందితుల నుండి 2లక్షల 3వేల రూపాయలు నగదుతో పాటు రెండు ల్యాప్‌టాప్‌లు, 23 సెల్‌ఫోన్లు, విదేశీ పాస్‌పోర్ట్‌లను పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో పాటు వివిధ బ్యాంక్ ఖాతాల్లో డిపాజిట్ అయి ఉన్న 28 లక్షల రూపాయలకు సంబంధించిన లావాదేవీలను నిలిపివేసారు. ఈ అరెస్ట్‌కు సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ మీడియాకు వెల్లడించారు. శాయంపేట పోలీస్ పరిధిలోని మైలారం గ్రామానికి చెందిన సిరిపురం మహేందర్‌కు 2017 ఏప్రిల్‌లో తన సెల్‌ఫోన్‌కు కోకాకోలా ఆన్ లైన్ లాటరీ వచ్చిందనీ, దాని విలువ 5లక్షల గ్రేట్ బ్రిటన్ పౌండ్స్ ( ఇండియన్ కరెన్సీ ప్రకారం 4కోట్ల 45లక్షలు) ఉంటుందని, దీనికి సంబంధించి బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ-మెయిల్‌కు సమాచారం పంపాలని ఒక ఎస్‌ఎంఎస్ వచ్చిందని తెలిపారు. సదరు బాధితుడు వెంటనే తన పూర్తి వివరాలతో మెయిల్ చేశాడు. ముందుగా రిజిస్ట్రేషన్ చార్జీల కింద 200 పౌండ్లను (లక్షా 80వేలు) చెల్లించాల్సి ఉంటుందని, లాటరీ డబ్బు త్వరలోనే వస్తుందని మహేందర్‌ను నమ్మించారు. వారు అడిగినట్లుగానే వారి బ్యాంక్ ఖాతాలో మహేందర్ డబ్బు జమచేసాడు. అనంతరం పలు దఫాలుగా నిందితులకు సంబంధించిన 12 ఎస్‌బీఐకి బ్యాంక్ ఖాతాల్లో 10 లక్షల రూపాయలను డిపాజిట్ చేశాడు. పెద్ద మొత్తంలో డబ్బు డిపాజిట్ చేసినా లాటరీ మొత్తం రాకపోవడంతో మహేందర్‌కు అనుమానం వచ్చి శాయంపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇదే తరహాలో జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రానికి చెందిన కరికే భరత్‌కుమార్ అనే యువకుడు నిందితులకు సంబంధించి వివిధ బ్యాంకులకు చెందిన 24 బ్యాంక్ ఖాతాల్లో 71 లక్షలు డిపాజిట్ చేసి మోసపోయిన సంఘటనతో బచ్చన్నపేట పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేశారు. ఈ రెండు సంఘటనలపై అప్రమత్తం అయిన వరంగల్ పోలీస్ కమిషనరేట్ సైబర్ క్రైం పోలీసులు ఈ కోకాకోలా లాటరీ మోసాలు ఢిల్లీ నుండి జరిగినట్లుగా నిర్ధారించారు. నిందితులు గుర్తించి పట్టుకోనేందుకుగాను వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పరకాల ఏసీపీ వైవిఎస్ సుధీంద్ర పర్యవేక్షణలో శాయంపేట ఇన్‌స్పెక్టర్ సాదుల్లాబాబా నేతృత్వంలో రెండు ప్రత్యేక దర్యాప్తు బృందాలు మందుగా సైబర్ సహకారంతో నిందితులు వినియోగించిన సెల్‌ఫోన్ నంబర్లు ఈ- మెయిల్ బ్యాంక్ ఖాతాలను ఆధారం చేసుకుని గత కొన్ని రోజులుగా దర్యాప్తు నిందితుల కోసం ఈ బృందాలు ఢిల్లీకి తరలివెళ్లారు. ఈ బృందాలు ముందుగా నిందితులు వినియోగించిన ఇంటర్‌నెట్ వివరాలను వినియోగించుకున్న ప్రదేశాన్ని గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్ధానిక ఢిల్లీ కోర్టు అనుమతితో దర్యాప్తు బృందాలు నిందితులను వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు తరలించారు. అరెస్ట్ చేసిన నింధితులను పోలీసులు విచారించగా నిందితులలో ఒకడైనా నైజీరియా దేశస్థుడు సైబర్ చీటర్ డిమ్యూయేషన్ ఉచైన్ 2015లో భారత్‌కు వచ్చాడు. ఇదే సమయంలో చిరు వ్యాపారం నిర్వహించుకోనేందుకు ఢిల్లీకి వచ్చిన మరో నిందితురాలు హీనియాకు డిమ్యూయేషన్ ఉచైన్‌తో పరిచయం కావడంతో వీరిద్దరూ కలిసి సైబర్ నేరాలకు ప్రణాళికను రూపొందించుకున్నారు. నిందితులు ఇప్పటి వరకు సుమారు ఆరు కేసుల్లో సుమారు కోటి రూపాయల వరకు తమ ఖాతాల్లో డిపాజిట్ చేయించుకున్నారు. ఇందులో వరంగల్ పోలీస్ కమిషనరేట్ శాయంపేట, బచ్చన్నపేటతో పాటు హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో మోసాలకు పాల్పడినట్లుగా నిందితులు పోలీసుల ఎదుట అంగీకరించారు.
చిత్రం..నిందితుల వివరాలను వెల్లడిస్తున్న వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్