క్రైమ్/లీగల్

ఔటర్‌పై ఘోర ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబ్రహీంపట్నం, జనవరి 11: ఔటర్ రింగ్ రోడ్డు మరోసారి రక్తమోడింది. డ్రైవర్ అతివేగం, నిద్రమత్తు నలుగురిని చిదిమేసింది. కారు, అంబులెన్స్‌ను ఢీకొన్న సంఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడ మృతిచెందారు. మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొంగర రావిరాల ఔటర్ రింగ్‌రోడ్డుపై శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఆదిభట్ల సీఐ నరేందర్ కథనం ప్రకారం కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా గంగావతికి చెందిన వెంకటేశ్వర రావు(60) అనారోగ్యానికి గురవడంతో ఏపీలోని ఏలూరులో చికిత్స చేయించుకున్నారు. తమ్ముడు రామారావు, భార్య సుబ్బలక్ష్మి(55), కుమారుడు హేమచందర్ రావు, అల్లుడు శ్రీనివాస్‌తో పాటు ఇద్దరు డ్రైవర్లతో కలిసి ఏడుగురు అంబులెన్స్‌లో తిరుగు ప్రయాణమయ్యారు. మహేశ్వరం మండలం కొంగరరావిరాల వండర్ లా సమీపంలోని ఎగ్జిట్ 13వద్దకు రాగానే ఎదురుగా అతివేగంగా వచ్చిన టాటా హెక్సా కారు అదుపుతప్పి అంబులెన్స్‌ను ఢీకొట్టింది. అంబులెన్స్‌లో ఉన్న డ్రైవర్ శివతో పాటు రామారావు, అతని భార్య సుబ్బలక్ష్మి అక్కడికక్కడే మృతిచెందారు. వీరితో పాటు మరో నలుగురు తీవ్రగాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న ఆధిభట్ల పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను నగరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రామారావు మృతిచెందారు. మిగితా ముగ్గురు చికిత్స పొందుతున్నారు. డ్రైవర్ నిద్రమత్తులో అతివేగంగా కారు నడపడంతోనే ప్రమాదం జరిగింది.