క్రైమ్/లీగల్
వదిన..మరిది ఆత్మహత్య!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 12 January 2019
మిర్యాలగూడ టౌన్, జనవరి 11: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం టీక్యా తండా సమీపంలో శుక్రవారం తెల్లవారుఝామున ఇద్దరు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న వారు సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం మాల్యానాయక్ తండాకు చెందిన ధీరావత్ భాస్కర్, ధీరావత్ సాల్కిలని రైల్వే పోలీసులు గుర్తించారు. వీరిద్దరు గత నవంబర్ 7న తండా నుంచి అదృశ్యమయ్యారని బంధువులు తెలిపారు. అప్పటి నుంచి కనిపించకపోవడంతో వారి కోసం గాలించడం జరిగిందన్నారు. వరసకు వీరిద్దరు వదిన, మరిదిలు.
వీరిరువురి మధ్య అక్రమ సంబంధం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని మిర్యాలగూడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.