క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చల్లపల్లి, జనవరి 13: మండల పరిధిలోని లక్ష్మీపురం కేసీపీ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురు యువకులు అక్కడిక్కడే మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ ప్రమాదంలో చల్లపల్లి మండలం రామానగరంకు చెందిన పెరుమాళ్ల ప్రసాద్ (25), మచిలీపట్నంకు చెందిన షేక్ గౌస్ (27) అక్కడిక్కడే మృతి చెందగా జావీద్ తీవ్రంగా గాయపడ్డాడు. పెరుమాళ్ల ప్రసాద్ తన ద్విచక్ర వాహనంపై రామానగరం నుండి లక్ష్మీపురం వైపు వెళుతుండగా బందరు నుండి చల్లపల్లి వైపు ద్విచక్ర వాహనంపై వస్తున్న షేక్ గౌస్, జావీద్ ఎదురెదురుగా ఢీకొన్నారు. అతివేగంతో రెండు ద్విచక్ర వాహనాలు ఒకదానినొకటి ఢీకొనగా ఇరువురు మృతి చెందారు. విషయం తెలుసుకున్న చల్లపల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వెంకట నారాయణ, ఎస్‌ఐ శ్రీనివాస్ ఘటనా స్థలికి చేరుకుని తీవ్రంగా గాయపడ్డ జావీద్‌ను మచిలీపట్నంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలకు పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపారు.