క్రైమ్/లీగల్

కంభంలో వ్యాపారి కిడ్నాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంభం, జనవరి 30: ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో ఓ వ్యక్తి కిడ్నాప్ అయిన సంఘటన బుధవారం వెలుగులోనికి వచ్చింది. అందిన వివరాల మేరకు స్థానికంగా ఇసుక వ్యాపారం చేస్తున్న నులక జగన్మోహన్‌రెడ్డి మంగళవారం రాత్రి తన వ్యాపార కలాపాలు ముగించుకుని సింధూరి మార్ట్ వెనుకవైపుగల తన ఇంటికి వెళ్లాడు. రాత్రి 12గంటల సమయంలో కారులో కొంతమంది వ్యక్తులు వచ్చి అతనిని రమ్మని బైటకు పిలుచుకువచ్చి కిడ్నాప్ చేసి తీసుకెళ్లినట్లు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ద్వారా బంధువులు గుర్తించారు. కాగా వ్యాపార లావాదేవీలా, మరే ఇతర గొడవల వలన తీసుకెళ్లారో తెలియాల్సి ఉంది. బుధవారం సాయంత్రం వరకు కూడా ఆచూకీ లభ్యం కాలేదు. అతని సెల్‌ఫోన్ కూడా స్విచాఫ్ చేసి ఉండటం గమనార్హం. జరిగిన సంఘటనపై కంభం ఎస్సై శ్రీహరికి ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.