క్రైమ్/లీగల్

టీడీపీ నేతల తీరుపై ఎమ్మెల్యే చెవిరెడ్డి ఫిర్యాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 5: గత రెండు రోజుల క్రితం పసుపు కుంకుమ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డిపై జరిగిన దాడి మరువక ముందే ఆయన, ఆయన కుటుంబ సభ్యుల కదలికలపై ఇద్దరు యువకులు రెక్కీ నిర్వహిస్తున్నట్లు గమనించిన ఎమ్మెల్యే నేరుగా ఎఎస్‌పికి ఫిర్యాదు చేశారు. చెవిరెడ్డి ప్రచారం కోసం వినియోగిస్తున్న వాహనాలకు ఈ యువకులు డ్రైవర్లుగా వ్యవహరిస్తుండటాన్ని ఎమ్మెల్యే అనుచరులు గుర్తించారు. ఈ సంఘటనతో చెవిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఈ ఇద్దరు డ్రైవర్లు కోవర్టులుగా పనిచేయడాన్ని ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు గుర్తించారు. ఈ విషయమై వారిని నిలదీయగా టీడీపీ నేతలే తమను మీవద్ద డ్రైవర్‌గా పంపించారని అంగీకరించారు. చెవిరెడ్డి కదలికలను టీడీపీ నేతలకు చేరవేయాలని తమకు వారు చెప్పారని నిందితులు చెప్పారు. దీనిపై ఎమ్మెల్యే చెవిరెడ్డి ఎఎస్‌పికి ఫిర్యాదు చేస్తూ తనకు భద్రత కల్పించాలని ఎమ్మెల్యే కోరారు.