క్రైమ్/లీగల్
ఫత్తేనగర్ బ్రిడ్జ్కు ఉరివేసుకొని మహిళ ఆత్మహత్య
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 7 February 2019
సనత్నగర్, ఫిబ్రవరి 6: ఫత్తేనగర్ బ్రిడ్జ్కు ఉరివేసుకొని మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన సనత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సనత్నగర్ ఎస్ఆర్టీలో నివాసం ఉండే బీములు, మంగతాయారు భర్యభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మంగళవారం అర్థరాత్రి బ్రిడ్జ్ వద్దకు మంగతాయారు వచ్చి తన చున్నీతో బ్రిడ్జికి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. బుధవారం ఉదయం ఇది గమనించి పోలీసులకు స్థానికులు సమాచారం ఇవ్వడంతో వెలుగులోనికి వచ్చింది. 12 ఏళ్ల క్రితం వీరికి వివాహం కాగా భార్త తరుచూ వేదింపులకు గురి చేసేవాడని తెలుస్తోంది. వేదింపులు భరించలేకే ఆత్మహత్య చేసుకుందని భావిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.