క్రైమ్/లీగల్

మురుగునీటి కాల్వను పూడ్చివేశారని ప్రశ్నించినందుకు ఘర్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏర్పేడు ఫిబ్రవరి 19: ఇంటి ముందు మురుగునీటి కాల్వను పూడ్చివేశారని ప్రశ్నించినందుకు పెద్దమ్మ కుమారుడిని పిన్నమ్మ కుమారులు పిడిగుద్దులు గుద్దడంతో, ఛాతీలో నొప్పి వచ్చి పెద్దమ్మ కుమారుడు మృతి చెందిన సంఘటన మండలంలోని మర్రిమంద గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. ఏర్పేడు సీఐ మురళి కథనం మేరకు మర్రిమంద గ్రామంలో పెద్దమ్మ కుమారుడు పులుసు మునస్వామి (45), అతని పిన్నమ్మ కుమారుడు కుమారస్వామి ఇళ్ల మధ్య మురుగునీటి కాల్వ ఉంది. కుమారస్వామి కారు ఇంటి వద్దకు వెళ్లేందుకు వీలుగా మురుగునీటి కాల్వను పూడ్చి వేశారు. దీంతో మురుగునీరు ప్రవహించక ఆగి పోవడంతో మునస్వామి, కుమారస్వామిని ప్రశ్నించాడు. ఆగ్రహించిన కుమారస్వామి తన సోదరుడు నేపాలు, కుమారస్వామి కుమారుడు పవన్‌తోకలసి మునస్వామిపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు. దీంతో మునస్వామికి తీవ్రమైన ఛాతీ నొప్పి వచ్చి స్పృహతప్పి పడిపోవడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు.