క్రైమ్/లీగల్

నా భూముల్లో అక్రమ నిర్మాణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 23: ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ దాన కిషోర్ బినామీ పేర్లతో తన భూముల్లో అక్రమ నిర్మాణాలను చేపట్టారని ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ జీ దీపక్‌రెడ్డి ఆరోపించారు. ఈమేరకు హైకోర్టులో ఆయన పిటిషన్ వేశారు. అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మేనల్లుడైన దీలీప్‌రెడ్డి నిర్మాణాలను తక్షణం నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని హైకోర్టును అభ్యర్థించారు. గుడిమల్కాపూర్ పరిధిలో సర్వే నెంబర్ 294లో తనకు ఆరెకరాలు భూమి ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ అనుమతులు లేకండా ఎలా నిర్మాణాలు చేపడతారని ఆయన ప్రశ్నించారు. జీహెసీఎంసీ కమిషనర్ దానకిషోర్ తన బినామీలతో రెండు కనె్వన్షన్ సెంటర్స్ నిర్మాణాలు వేగంగా చేపడుతున్నారంటూ పిటిషన్‌లో తెలిపారు. ఏఐఎస్ అధికారి దానకిషోర్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కోరారు.