క్రైమ్/లీగల్

మరో ఐదుగురు పోలీస్‌లపై చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 23: ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసులో మరో ఐదుగురు పోలీస్ అధికారులను విచారించడానికి దర్యాప్తు అధికారులకు నోటీసులు ఇవ్వనున్నారు. ఈ కేసులు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏసీపీ మల్లారెడ్డి, సీఐలు శ్రీనివాసులు, రాంప్రసాద్, హెచ్‌ఆర్ రెడ్డి, డీఎన్ రెడ్డిలపై బదిలీ వేటు పడింది. మరో ముగ్గురు ఏసీపీలు, ఇద్దరు సీఐలతో పాటు ఇద్దరు ఎస్‌ఐలు ఉన్నారు. వీరికి త్వరలో నోటీలు ఇవ్వనున్నారు. జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న రాకేష్‌రెడ్డితో పాటు, డ్రైవర్ శ్రీనివాస్‌పై పోలీస్ కష్టడీ శనివారంతో ముగిసింది.
ఈ హత్య కేసులో ఎవరెవరి ప్రమేయం ఏమేరకు ఉందన్న విషయాలపై లోతుగా విచారించనున్నారు. రౌడీ షీటర్ నగేశ్‌తో పాటు శ్యామ్‌ను అరెస్టు చేయడానికి రంగం సిద్ధమైంది. హత్యకు గురైన జయరాం మేనకోడలు శిఖా చౌదరిని మరోసారి విచారణకు పిలుస్తున్నారు.