క్రైమ్/లీగల్

ఎస్‌బీఐ మేనేజర్ పేరుతో ఫోన్‌కాల్ గంటలో రూ. 39వేలు మాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గణపురం, ఫిబ్రవరి 23: ‘స్టేట్ బ్యాంక్ మేనేజర్‌ను మాట్లాడుతున్నా... మీ ఖాతా వివరాలు కావాలి’ అంటూ ఆరు సార్లు వరుసగా ఫోన్‌లు చేసి ఖాతా వివరాలు తీసుకుని గంటలో ఖాతా నుండి రూ. 39వేలు మాయం చేసిన సంఘటన భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని గొల్లపల్లి గ్రామంలో జరిగింది. బాధితుడు బండి రమేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చెల్పూరు గ్రామీణ వికాస్ బ్యాంకు అకౌంట్ నంబర్ 73085429835లో రమేష్ పేరున రూ. 39వేల డబ్బులు ఉన్నాయి. ఈ క్రమంలో శనివారం ఉదయం 9 గంటల 59 నిమిషాల నుండి 10 గంటల 27 నిమిషాల వరకు ఆరు సార్లు 6201636659 నంబర్ నుండి ఫోన్ చేశారు. ఫోన్‌లో ఎస్‌బీఐ ఏటీఎం డిపార్ట్‌మెంట్ మేనేజర్‌ను అని చెప్పడంతో బాధితుడు పూర్తి వివరాలు తెలపడంతో గంట వ్యవధిలోనే 39వేల రూపాయలు అకౌంట్ నుంచి మాయమయ్యాయి. బాధితుడు రమేష్ మొబైల్ నంబర్‌కు ఆలస్యంగా డబ్బులు డ్రా అయినట్లు మెసేజ్ రావడంతో లబోదిబోమంటూ స్థానిక పోలీసులను ఆశ్రయించారు. గణపురం మండలంలో ఇదే మొదటి సైబర్ నేరమని పోలీసులు అంటున్నారు.