క్రైమ్/లీగల్

కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, ఫిబ్రవరి 24: కాశ్మీర్‌లోయలో ఉగ్రవాదుల కోసం ఆర్మీ వేటను ముమ్మరం చేసింది. ఆదివారం దక్షిణ కాశ్మీర్‌లో పోలీసులకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పుల ఘటనలో జైషే మహ్మద్ సంస్థకు చెందిన ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఒక డీఎస్పీ అధికారి అమరుడయ్యారు. కుల్గాం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిఘా సమాచారం మేరకు పోలీసులు ఈ ప్రాంతంలో గాలింపు చర్యలను ఉధృతం చేశారు. ముందుగా ఉగ్రవాదులు కాల్పులకు దిగా, ఆత్మరక్షణ కోసం ఆర్మీ, పోలీసులు ప్రతికాల్పులు చేశారు. ఈ కాల్పుల్లో అమన్ ఠాకూర్ అనే పోలీసు అధికారి నేలకొరిగారు. హతమైన ఉగ్రవాది వివరాలు తెలియాల్సి ఉంది. ఈ వివరాలను జమ్ముకాశ్మీర్ డీజీపీ దిల్‌బాగ్ సింగ్ చెప్పారు. ఈ దాడిలో ఒక పోలీసు అధికారి మరణించడం దురదృష్టకరమని ఆయన అన్నారు.